పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ కృతిసనన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.నటిగా, మోడల్ గా కృతిసనన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ప్రముఖ కంపెనీల యాడ్స్ లో నటించి పాపులారిటీని పెంచుకున్న కృతిసనన్ తెలుగులో 1 నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే 1 నేనొక్కడినే సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఆ తర్వాత కృతి తెలుగులో దోచెయ్ అనే సినిమాలో నటించారు.
దోచెయ్ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.ఫలితంగా కృతిసనన్ తెలుగు సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ హీరోయిన్ బ్యాగ్రౌండ్ గురించి మాత్రం ఆమె అభిమానులకు పెద్దగా తెలియదు.
అందం, అభినయం పుష్కలంగా ఉన్న కృతిసనన్ తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.
హీరో పంతి సినిమాతో తొలి హిట్ ను అందుకున్న కృతి ఆ తరువాత నటించిన పలు సినిమాలు సైతం హిట్ అయ్యాయి.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ లో కృతిసనన్ బీటెక్ చదివారు.
కృతిసనన్ తండ్రి పేరు రాహుల్ కాగా ఆయన ఛార్టెడ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నారు.
కృతిసనన్ తల్లి ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.కృతి సనన్ కు ఒక చెల్లి ఉండగా ఆమె పేరు నూపుర్.కృతిసనన్ కథక్ డ్యాన్సర్ కూడా కావడం గమనార్హం.
ఆదిపురుష్ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొనగా సీత పాత్రతో కృతిసనన్ మెప్పిస్తారో లేదో చూడాల్సి ఉంది.అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో కృతిసనన్ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.