పూరీ జగన్నాథ్ అప్పు సినిమా.. ఇడియట్ సినిమా గురించి ఎవరికీ తెలియని నిజాలు.. అవి ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్.

 Interesting Facts About Director Puri Jagannath Idiot Movie And Appu Movie Detai-TeluguStop.com

ఇడియట్, పోకిరి, టెంపుల్, నేనింతే వంటి మాస్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలనే తెరకెక్కించాడు.

కొన్ని కొన్ని సార్లు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు పూరీ.అయినా కూడా తన సహనాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి మరి సినిమాలను రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇదిలా ఉంటే పూరి దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.

రవితేజ, రక్షిత జంటగా నటించిన ఈ సినిమా 2002 లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస రెడ్డి తదితరులు నటించారు.

ఈ సినిమాకు చక్రి సంగీతం అందించగా ఈ సినిమా మంచి హిట్ సొంతం చేసుకుంది.ఇక ఇదే సినిమా అప్పు అనే పేరుతో అప్పటికే కన్నడంలో విడుదలైంది.

ఇక ఈ సినిమాను 2002లో ఏప్రిల్ లో విడుదల చేయగా ఈ సినిమాకు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

Telugu Appu, Puri Jagannath, Idiot Appu, Idiot, Liger, Punith Rajkumar, Rakshith

ఇక ఇందులో పుణీత్ రాజకుమార్, రక్షిత జంటగా నటించారు.అంతేకాకుండా అవినాష్ , శ్రీనివాస మూర్తి, సుమిత్ర తదితరులు నటించారు.అయితే ఈ రెండు సినిమాలకు మధ్య చాలావరకు తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి.

అదేంటి ఈ సినిమాల మధ్య ఏం నిజం ఉందో అని అనుకుంటున్నారా.అయితే 2002లో ఏప్రిల్ లో అప్పు సినిమా విడుదల కాగా అదే సినిమాను తెలుగులో ఇడియట్ గా రీమేక్ చేశారు.

ఇక ఈ సినిమా కూడా 2002లో ఆగస్టు 22 కి విడుదలైంది.ఆ సమయంలో అప్పు సినిమా 200 రోజులు అవ్వకముందే ఇడియట్ సినిమాను షూట్ చేసి విడుదల చేశారు.

అప్పు 200 రోజులు ఉన్నప్పుడు ఇడియట్ సినిమా 50 రోజులకు దగ్గరలో ఉందట.అయితే ఇంత వేగంగా ఈ సినిమా షూటింగ్ తీసి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు డైరెక్టర్ పూరి.

Telugu Appu, Puri Jagannath, Idiot Appu, Idiot, Liger, Punith Rajkumar, Rakshith

అంత త్వరగా తీసినప్పటికీ కూడా భారీ బడ్జెట్ తో మంచి సక్సెస్ అందుకుంది.అలా ఆ రెండు సినిమాలకు మధ్య కొంత గ్యాప్ ఉన్నా కూడా అంత సక్సెస్ అందుకోవటం చాలా గ్రేట్ అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం సినీ బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుంది.

మరి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube