ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో ధనుష్ ఐశ్వర్యల విడాకుల గురించి చర్చ జరుగుతోంది.ధనుష్ ఐశ్వర్యల విడాకుల విషయంలో కొంతమంది తప్పు ధనుష్ వైపు ఉందని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఐశ్వర్యదే తప్పు అని చెబుతున్నారు.
అయితే ధనుష్ తండ్రి కస్తూరి రాజా మాత్రం ధనుష్, ఐశ్వర్య కలిసే ఛాన్స్ ఉందని చేసిన కామెంట్ల వల్ల అభిమానులు సంతోషిస్తుండటం గమనార్హం.
అయితే వీళ్లిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందని ధనుష్ అభిమానులు కూడా నమ్ముతున్నారు.
ధనుష్ అభిమానులు ఈ విధంగా భావించడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలలో పేర్లను మార్చుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఐశ్వర్య మాత్రం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పేరును మార్చుకోలేదు.
మరోవైపు ధనుష్ ఐశ్వర్య చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది.
విడిపోతున్నామని ప్రకటించినా వాళ్లిద్దరూ కోర్టు మెట్లు ఎక్కకపోవడంతో వాళ్లు మళ్లీ కలిసే అవకాశం అయితే ఉండవచ్చని అభిమానులు సైతం బలంగా నమ్ముతున్నారు.ఐశ్వర్య ధనుష్ మళ్లీ కలిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.
మరోవైపు ధనుష్ సినిమాలతో బిజీ అవుతున్నారు.
వరుసగా సినిమాలలో నటిస్తున్న ధనుష్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.ఈ మధ్య కాలంలో ధనుష్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాలను అందుకున్న నేపథ్యంలో ధనుష్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ధనుష్, అక్షయ కుమార్ కలిసి నటించిన ఆత్రంగి రే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ధనుష్ నటించిన పలు సినిమాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.