నాగచైతన్య సమంత దంపతులు కలకాలం కలిసి ఉండటంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని అందరూ భావిస్తున్నారు.గత కొన్నిరోజులుగా చైతన్య, సమంత విడిపోతున్నారని ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతున్న ప్రచారమే చివరకు నిజమైంది.
భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటామని సమంత, చైతన్య కలిసి ప్రకటన చేసినా ఈ జోడీ మళ్లీ లిసే అవకాశాలు అయితే దాదాపుగా లేవనే చెప్పాలి.
అయితే సమంత, చైతన్య కలిసి నటించిన సినిమాలను పరిశీలిస్తే ఆ సినిమా కథ, కథనం ఎక్కువగా ప్రేమించడం, విడిపోవడం చుట్టూ తిరిగాయి.
చైతన్య సమంతలకు ఏ మాయ చేశావె ఇష్టమైన మూవీ కావడంతో పాటు ఈ సినిమా వాళ్ల కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.ఏ మాయ చేశావె సినిమా కథలో సమంత జెస్సీ అనే మలయాళ క్రిస్టియన్ కావడం, వయస్సు పరంగా సమంత పెద్ద కావడంతో సమస్యలు ఎదురవుతాయి.
మనం సినిమాలో సైతం సమంత నాగచైతన్య భార్యాభర్తలుగా నటింగా ఆ సినిమాలో సమంత చైతన్యను అపార్థం చేసుకోవడం వల్ల వాళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.
ప్రేమ, పెళ్లి సంఘర్షణతో తెరకెక్కిన మజిలీ సినిమాలో భర్త నాగచైతన్య ప్రేమించిన యువతి దూరం కావడంతో బాధ పడుతూ ఉంటాడు.అయితే భర్త ఏదో ఒకరోజు మారతాడని ఎదురు చూస్తూ ఉంటుంది.అయితే నిజ జీవితంలో మాత్రం చైతన్య సమంతల ప్రేమ, పెళ్లికి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు.
చైతన్య, సమంతల కుటుంబ సభ్యులు సులభంగానే పెళ్లికి అంగీకరించారు.పెళ్లి తర్వాత సైతం చైతన్య, సమంత గొడవలు పడ్డారని ఎప్పుడూ వార్తలు రాలేదు.సమంత చైతన్య మళ్లీ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటుండటం గమనార్హం.చైతన్య సమంత జంట బాగుంటుందని ఈ జోడీ విడిపోవడం తమకు బాధ కలిగిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.