బాలకృష్ణ ,బి.గోపాల్ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు తెరకెక్కగా ఆ ఐదు సినిమాలలో నాలుగు సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఆ నాలుగు సినిమాలలో సమరసింహారెడ్డి సినిమా కూడా ఒకటి.
సిమ్రాన్, అంజలా జవేరీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది.
అయితే మేకర్స్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం మొదట రాశిని సంప్రదించారు.అయితే ఈ సినిమాలోని సీతాకోక చిలుక సీన్ లో నటించడానికి ఇష్టం లేకపోవడంతో రాశి ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్నారు.
ఆ తర్వాత మేకర్స్ ఆ పాత్ర కోసం సిమ్రాన్ ను సంప్రదించగా సిమ్రాన్ ఆ పాత్రలో నటించడానికి అంగీకరించారు.ఈ సినిమా విడుదలై 23 సంవత్సరాలు ఆయింది.
73 కేంద్రాలలో సమరసింహారెడ్డి సినిమా శత దినోత్సవం జరుపుకోవడం గమనార్హం.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు డిమాండ్ పెరిగింది.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది.మొదట వెంకటేష్ కు బి.గోపాల్ ఈ కథ చెప్పగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో వెంకీ నటించలేదు.
సమరసింహారెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు నటుడిగా బాలకృష్ణకు క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచింది.మొదట బొంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ భావించగా శిష్యుడు రత్నం సూచనల మేరకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథాంశంతో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ తయారు చేశారు.