స్టార్ హీరో బాలకృష్ణ సినీ కేరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో భైరవద్వీపం సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.
బాలయ్యకు జోడీగా రోజా ఈ సినిమాలో నటించగా 1994 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం.
జానపద చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నంది అవార్డు వచ్చింది.
ఈ సినిమాకు చిరంజీవి స్విచ్ ఆన్ చేయగా రజనీకాంత్ క్లాప్ కొట్టారు.1994 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్లపరంగా రికార్డులను క్రియేట్ చేసింది.ఈ సినిమాలోని నరుడ ఓ నరుడా పాట ఈతరం ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలను అందుకుంది.
అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాలో గుర్రాలకు బాణాలు తగిలే సన్నివేశాల గురించి చెబుతూ ఆ సన్నివేశాల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారని బోగట్టా.
అయితే వన్యప్రాణి సంరక్షణ సంఘం నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే మాత్రం ఆ షాట్స్ ను తొలగించాల్సి ఉంటుందని భైరవద్వీపం మేకర్స్ కు సెన్సార్ సభ్యులు చెప్పారు.అయితే సినిమా రిలీజైన తర్వాత వాళ్ల నుంచి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.
ఈ సినిమాలో గుర్రాలు వేగంగా పరుగెత్తే సమయంలో అవి ఆగడానికి వైర్లు కాళ్లకు అడ్డంగా కట్టారు.ఇలా చెయ్యడం వల్ల గుర్రాల కాళ్లకు దెబ్బలు తగలడంతో పాటు గుర్రాలు నడవలేని స్థితి ఏర్పడింది.అయితే గుర్రాలకు ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్య చికిత్స అందేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు.బాలయ్య కేరీర్ లో స్పెషల్ మూవీగా భైరవద్వీపం నిలవడం గమనార్హం.