కేజిఎఫ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమాతో యష్ ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సినిమా కేజీఎఫ్.కెజిఎఫ్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ పేరు, యష్ పేరు ప్రపంచం అంతా వినిపిస్తున్నాయి.
కేజిఎఫ్ అంత పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో రాఖీ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ ఇప్పుడు కెజిఎఫ్ 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.
సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.నిర్మాతలు ముందుకన్నా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం దెస వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటేనే అర్ధం అవుతుంది యష్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో అని.ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్ అన్ని భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.ఈ సినిమాలో రాఖీ బాయ్ లవర్ గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.ఈ సినిమాను జులై 16 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.కానీ కరోనా వచ్చిన కారణంగా వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు.
కానీ తాజాగా రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ తన రోల్ గురించి ఒక పేపర్ ద్వారా తెలిపారు.
అందులో ఒక స్టాంప్ వేసి ఉంది.
ఆ స్టాంప్ లో జులై 16 నుండి కంటిన్యూ అవుతుంది అని రూపొందించడంతో అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు.ముందుగా ప్రకటించిన డేట్ తోనే ఈ స్టాంప్ ఉండడంతో విడుదల తేదీ మార్చలేదని తెలుస్తుంది.
మరి చూడాలి ఈ విడుదల తేదీ మారుస్తారో లేదో.