తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్, జగ్గారెడ్డిలు చెబుతున్నారు.
తమది తోడికోడళ్ల పంచాయతీ అంటూ కామెంట్స్ చేశారు.పొద్దున తిట్టుకుంటాం.
మళ్లీ కలిసిపోతామని తెలిపారు.రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్ధతు ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డిని దింపి పీసీసీ కావడం సాధ్యం కాదన్న జగ్గారెడ్డి మరో పది సంవత్సరాలైనా రేవంత్ దిగిన తర్వాతనే తాను పీసీసీ అవుతానని స్పష్టం చేశారు.