టీడీపీ నేత నారా లోకేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.టీడీపీ కంచుకోట మంగళగిరిని కాపుకాసే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు.
తనను ఓడించేందుకు జగన్ వాడే ఆయుధాలను ధీటుగా ఎదుర్కొవాలని తెలిపారు.అదేవిధంగా జనవరి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.
సుమారు నాలుగు వందల రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.ఈ క్రమంలో మంగళగిరిలో నాలుగు రోజులపాటు పాదయాత్ర ఉంటుందని నారా లోకేశ్ తెలిపారు.