ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ నెల 13వ తేది శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి.2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులంతా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి.ఈమేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కమిషనర్ వి.రామకృష్ణ మార్గదర్శకాలు జారీ చేశారు.నిబంధనల ఆధారంగా రిజర్వేషన్లు పారదర్శకంగా సీట్లను కేటాయిస్తారు బాలికలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.విద్యార్థుల ప్రాధాన్యత క్రమంలో లచ్చన్న కళాశాలను గ్రూపును ఎందుకు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.
మొదటి దశలో ప్రవేశం పొందిన విద్యార్థులకు మిగిలిన ఖాళీలను రెండో దశలో నిర్వహిస్తారు.ఇందుకోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ లోనే కొనసాగుతోంది.విద్యా సంవత్సరం ఆన్లైన్ ప్రవేశ సందర్భంగా చాలా సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
దీనిపై గ్రామీణ ప్రాంత విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో గందరగోళం నెలకొంది.దీంతో చాలామంది విద్యార్థులు ప్రవేశం ఆలస్యంగా పొందారు.
ఈ విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం కళాశాలలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే అనధికారికంగా తరగతులు ప్రారంభించాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంతో అధికారికంగా విద్యార్థులు సమాచారాన్ని సేకరించి ప్రవేశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. www.bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా విద్యార్థుల ప్రవేశాల కోసం దరఖాస్తు చేయాలి.