ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో వాడుతున్నది ఇన్స్టాగ్రామ్ అని చెప్పవచ్చు.ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిసిటీ పొందుతున్నావారు చాలా మందే ఉన్నారు.
ఈ మధ్యనే ఇన్స్టాలో పాపులర్ అయిన వారు టీవీ షోలలో తళుక్కుమంటున్నారు కూడా.మరి అటువంటి ఈ ప్లాట్ ఫామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ మరోకొత్త అప్డేట్ చేసింది.దీని ప్రకారంగా చూస్తే యూజర్లు తమ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
ఈనాటి రోజుల్లో సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి.అకౌంట్లను హ్యాక్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ విధానం వలన యూజర్లకు ఎటువంటి ముప్పు ఉండదు.వారు తమ అకౌంట్ హ్యాక్ అయినా లేదా డేటా లీక్ అయినా యూజర్లకు ఆ విషయం తెలిసిపోతుంది.
కొత్తగా లాగిన్ అయ్యే ముందే యూజర్లకు భద్రతా తనిఖీ నోటిఫికేషన్ అనేది రావడం వలన ఇటువంటి మంచి సౌకర్యం ఇప్పుడు దేశం మొత్తం అందుబాటులో లేదు.త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.చాలా దేశాలలో యూజర్లు తమ అకౌంట్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఖాతాను సురక్షితంగా కాపాడుకునే అవకాశాన్ని కల్పించారు.మీ స్మార్ట్ ఫోన్ నంబర్ తో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రెండు రకాలుగాను అకౌంట్ ను ప్రారంభించండి.
దీని కోసం మీరు డుయో మొబైల్ లేదా గూగుల్ ను కూడా వినియోగించవచ్చు.మీ అకౌంట్ తో ఇమెయిల్, ఫోన్ నంబర్ను ఎప్పుడూ సరిగ్గా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
ఒకవేళ మీరు ఆ నంబర్లను మార్చినట్లైతే వెంటనే ఇన్స్ట్రాగ్రామ్ లో కూడా ఆ సమాచారాన్ని అప్ డేట్ చేయడం ఎంతో మంచింది.