లండన్ లో ఓ తెలుగు ప్రొఫిసర్ పై కేసు నమోదు అయ్యింది.ఏకకాలంలో రెండు యూనివర్సిటీలలో ఉద్యోగం చేసేందుకు గాను ఆయన ఇప్పుడు న్యాయవిచారణ ఎదుర్కుంటున్నారు.దాంతో ఇప్పుడు సదరు తెలుగు ప్రొఫెసర్ ఎదుర్కున్న కేసు సంచలనం సృష్టిస్తోంది.
2015 సెప్టెంబర్ నుంచీ 2016 నవంబర్ వరకూ అఖిలేష్ రెడ్డి అనే తెలుగు ప్రొఫిసర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్లో ఈ రెండిటిలోనూ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు చేశారని ది టైమ్స్ వెల్లడించింది.అయితే ఈ విషయం ఎంతో గోప్యంగా ఉంచుతూ వచ్చారు అఖిలేష్ రెడ్డి.
కానీ ఈ విషయం బయటపడటంతో ఆయనపై యూకే మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రైబ్యునల్ సర్వీసు విచారణ చేపట్టింది.
ఇది రుజువైతే ఎలాంటి తీర్పు ఆయన విషయంలో వేల్లదవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంభ సభ్యులు.అఖిలేష్ రెడ్డి నిద్రకి సంభందించి కలిగే సమస్యలపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు.