యూఏఈ లో ప్రఖ్యాతి గాంచిన భారత సంతతి వైద్యురాలు జులేఖా దౌద్ కి అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసా శాశ్వత వీసా ఇచ్చి గౌరవించుకుంది.అయితే ఈ వీసా అందుకున్న మొట్టమొదటి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది.
వైద్య రంగంలో తమ దేశానికి అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను ఆమెని మేము గౌరవించుకుంటున్నామని ప్రకటించింది.
జులేఖా హెల్త్ గ్రూప్ చైర్మెన్ అయిన జులేఖా స్థానికంగా రెండు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పారు.అంతేకాదు.అలాగే యూఏఈ లో మూడు మెడికల్ సెంటర్ లు, నాలుగు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారు.
అలాగే మరోంతో మందికి ఉపాదికి మార్గం చూపారు.
ఇదిలాఉంటే యూఏఈ తనని గోల్డెన్ వీసా ఇచ్చి గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందని జులేఖా తెలిపారు.ఇది తనకి దక్కిన అరుదైన గౌరవమని, యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ దేశానికి సేవ చేసే భాధ్యత మరింత పెరిగిందని ఆమె అన్నారు.
ఇప్పటి వరకూ గోల్డెన్ వీసాలు సుమారు 6000 లకు పైగానే యూఏఈ ఇచ్చింది.ఈ వీసా వలన యూఏఈ లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడం కోసమే ఈ వీసాని గత ఏడాది ప్రవేశ పెట్టింది.
తాజా వార్తలు