తిరుపతి జిల్లాలోని కేవీబీ పురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.ఉదయం ఏడేళ్ల బాలుడు బసవయ్య పాము కాటుకు గురయ్యాడు.
దీంతో బాలుని తండ్రి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చాడు.ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చేసరికి బాలుడు కన్నుమూశాడు.
శవాన్ని తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనదారులు, ఆటోలు నిరాకరించాయి.దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొడుకు శవాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్లాడు ఆ తండ్రి.
ఈ ఘటన చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.