ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయాణ అల్లుడు రిషి సునక్ బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియమితులైన విషయం విధితమే.రిషి సునక్ ఎంతో కీలక పదవిలో ఉంటూనే బ్రిటన్ చట్టాలకు వ్యతిరేకంగా వ్యహ్వారించారని, తన ఆర్ధిక వ్యవహారాలను తొక్కి పెట్టి తప్పు చేశారని, గార్డియన్ పత్రిక ప్రచురించింది.
గార్డియన్ కధనం ప్రకారం చూస్తే.సునక్ భార్య, అతడి కుటుంభ సభ్యులు కోట్లు విలువ చేసే షేర్స్ కలిగి ఉన్నారని కానీ సునక్ ఎక్కడా వాటి గురించి వెల్లడించలేదని రాసుకొచ్చారు…ఇక గార్డియన్ మరో కధనంలో
రిషి సునక్ భార్య అక్షత మూర్తి నారాయణ మూర్తి కుమార్తె అయితే సదరు కంపెనీలో అక్షత కు సుమారు 430 మిలియన్ పౌండ్లు విలువ చేసే షేర్స్ ఉన్నాయని, కానీ సునక్ అన్ని విషయాలు తొక్కి పెట్టారని తన భార్య కు ఉన్న షేర్స్ విలువ లెక్కగడితే ఆమె బ్రిటన్ లో అత్యంత ధనవంతురాలిగా ఉంటారని, అంతేకాదు క్వీన్ ఎలిజిబెత్ కంటే కూడా ధనవంతురాలు అవుతారని ఈ కధనంలో తెలిపారు.ఇదిలాఉంటే
బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం, మంత్రి వర్గ నియమావళి ప్రకారం సునక్ తనకు తన కుటుంభ సభ్యులకు సంబందించిన ఆస్తుల లెక్కలు కూడా వెల్లడించాలి.అంటే తల్లి తండ్రులు, భార్యా, అత్తా, మామా లకు ఉన్న ఆస్తులు కూడా వెల్లడించడం తప్పనిసరి కానీ సునక్ తన పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు తెలిపారు తప్ప ఎక్కడ ఇతరాత్రా విషయాలు వెల్లడించలేదని, దాంతో సునక్ ఆర్ధిక లావాదేవీలపై పలు సందేహాలు కలుగుతున్నాయని, వాటిపై సునక్ తప్పకుండా ప్రజలకు తెలియజేయాలని గార్డియన్ తెలిపింది.
.