ఐటీకి మళ్లీ కొత్త రోజులు వచ్చాయి.ఆర్ధిక మంధ్యం పుణ్యమా అంటూ గత కొన్ని ఏళ్లుగా కుదేలు అయిపోతున్న ఐటీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
అయితే ఇదే క్రమంలో కొన్ని కంపెనీలు ఉద్యోగస్తులకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి.ముఖ్యంగా బడా కంపెనీలు ఈ కోవలో పోటీ పడుతూ మరి ముందుకు పోతున్నాయి.
ఈ మధ్యనే హెచ్.సీ.ఎల్ సంస్థ ఆ కంపెనీ ఉద్యోగస్తులకు మెర్సిడెజ్ కారులు బహుమతిగా ఇచ్చిన సంగతి మరవక ముందే తాజాగా ఇన్ఫోసిస్ కంపెనీ సైతం హెచ్.సీ.ఎల్ కు పోటీగా ఎంప్లాయీస్ కి బహుమతులు ప్రకటించింది.ఇన్ఫీ తమ ఉద్యోగులకు ఐ ఫోన్ 6 ఎస్ ను ఇచ్చింది.
అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-3000 ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు.ఐఫోన్ 6ఎస్ తో పాటు ఓ ఈ మెయిల్ ను ఉద్యోగులకు పంపారు.
ఈ సందర్భంగా విశాల్ సిక్కా ‘గతేడాది సంతోషకరంగా ముగిసింది.ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం.
సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు… వేడుక చేసుకోవాల్సిన సమయం’ అని అన్నారు.హాలిడే బోసన్ పై సంస్థ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తూ …గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు.
కాగా ఉన్నత పదవులతో పాటు, భారీ ప్యాకేజీల వేతనాల కోసం సాప్ట్ వేర్ ఉద్యోగులు…ఉద్యోగాలు వీడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఉద్యోగులను నిలుపుకునేందుకు గిప్ట్ లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వటం విశేషం.
ఏది ఏమైనా ఐటీ రంగానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి.