ఇక మొదలు...అమెరికా నుంచీ భారత్ వచ్చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు..!!

అమెరికాలో నవంబర్ లో జరగనున్న ఎన్నికల కారణంగా అమెరికా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎంతో మంది విదేశీ నిపుణుల ఉద్యోగాలకి కత్తెర పడుతోంది.వీసాలపై విధించిన తాత్కాలిక నిషేధం కారణంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు వెనక్కి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది.

 Infosys Flies Back 200 Employees,infosys, Employees, Visa Completion, Us, Infosy-TeluguStop.com

కేవలం రాజకీయ లబ్దికోసం ట్రంప్ చేపట్టిన ఈ దుశ్చర్యల కారణంగా ఎన్నో కుటుంభాలు.వారి ఆర్ధిక పరిస్థితులు ఆందోళన కరంగా మారిపోయాయి.

తాజాగా అమెరికాలో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కంపెనీ పై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం పడింది.సుమారు 206 మంది ఉద్యోగులు ఈ వీసా బ్యాంక్ కారణంగా ఇంటి బాట పట్టారు.

ఒక పక్క కరోనా విలయానికి అతలాకుతలం అయిన ఎన్నారైలు తాజాగా వీసా కారణంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఒక పక్క వీసా గుడువు ముగియగా మరో పక్క రెన్యువల్ కి అవకాశం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు.

Telugu Employees, Infosys, Visa-

ఇదిలాఉంటే వీసాల గడువు ముగియడంతో అమెరికాలో ఉండటానికి అర్హత లేదు.మరో పక్క విమాన సర్వీసులు లేవు.ఈ పరిస్థితులని గమనించిన ఇన్ఫోసిస్ తమ 206 మంది ఉద్యోగుల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి స్వదేశానికి ఉద్యోగాలని పంపింది.ఈ మేరకు కంపెనీ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడె ఓ ప్రకటిన విడుదల చేశారు.

తమ కంపెనీలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారిలో చాలామందికి వీసాల గడువు ముగిసిందని వారిని తామే వారి వారి స్వదేశానికి పంపుతున్నట్టుగా తెలిపారు.తమని భారత్ కి చేర్చిన ఇన్ఫోసిస్ కి ఉద్యోగులు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉంటే భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగుతుందని.ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube