విశాఖలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.అక్టోబర్ 1 నుంచి విశాఖలోని తన కార్యాలయంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలను ప్రారంభించనుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.
తొలి దశలో వెయ్యి మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించనున్న ఇన్ఫోసిస్… క్రమంగా ఉద్యోగుల సంఖ్యను 3 వేలకు పెంచనుందని వెల్లడించారు.ఫలితంగా ఏపీలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మరింతగా విస్తరించనున్నాయని మంత్రి స్పష్టం చేశారు.