సినిమా ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది.కరోనా మహమ్మారి బారిన పడి ప్రముఖ సీనియర్ సినీ టీవీ నటి మాధవి గోగటే కన్నుమూశారు.
దీంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన మాధవి ఎన్నో అద్భుతమైన చిత్రాలు టీవీ సీరియల్స్ రియాలిటీ షోలలో నటించి విశేష ఆదరణ దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే ఈమె గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.ఇలా కరోనా బారిన పడటంతో ఈమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఈమె ఆరోగ్య పరిస్థితి విషమించడంచేత నటి మాధవి తుదిశ్వాస విడిచారు.
కరోనా బారినపడి మాధవి మృతి చెందారన్న విషయం తెలియడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఈమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈమె ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త విన్న అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ఈమె ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు.