ప్రయాణం, అష్టాచెమ్మా, అమీతుమీ, సమ్మోహనం లాంటి సినిమాలతో రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలని తెరకెక్కించడంతో ఇంద్రగంటి మోహనకృష్ణ తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు.రొమాంటిక్ కథలనే కాకుండా జెంటిల్మెన్, వి సినిమాలతో థ్రిల్లర్ కథలని కూడా ట్రై చేశాడు.
అయితే వి సినిమా అతనికి భారీ డిజాస్టర్ ని అందించింది.రొటీన్ రివేంజ్ డ్రామాగా తేలిపోయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంద్రగంటి వి సినిమా జ్ఞాపకాల నుంచి బయటపడి కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.అది కూడా సుధీర్ బాబుతో.
సమ్మోహనం, వి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం.ఇప్పటికే సుధీర్ బాబు పలాస ఫేమ్ కరుణ కుమార్ తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఒకటి స్టార్ట్ చేశాడు.
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంద్రగంటి దర్శకత్వంలో కొత్త సినిమాకి ఒకే చెప్పాడు.బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకు బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి నిర్మాతలు.దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సమ్మోహనం జోనర్ లోనే ఈ సినిమా కథ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే హీరో సుధీర్ బాబు ట్విట్టర్ లో ఈ సినిమా గురించి స్పందించారు.అద్భుతమైన టీమ్ మళ్లీ కలుస్తోందని, ఓ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాం అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మరి వి సినిమాతో ఏదో ప్రయోగం చేయబోయి బోర్లాపడ్డ ఇంద్రగంటి తనకి అలవాటైన రొమాంటిక్ జోనర్ తో మళ్ళీ హిట్ ట్రాక్ లో పడతాడా అనేది చూడాలి.
తాజా వార్తలు