దేశంలో కరోనా తీవ్రంగా వింజృభిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ప్రజలంతా కరోనా నిబంధలను తప్పని సరిగా పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
ఒకవేళ ఇలా చేయని వారికి జరిమానాలు విధిస్తున్నాయి.అదీగాక భయపెట్టో, బ్రతిమిలాడో మొత్తానికి ప్రజలకు కరోనా రక్షణ చర్యలు నేర్పిస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా మాస్కు దరించకుంటే దండించే పోలీసులను ఎప్పుడైనా చూశారా.లేదా అయితే చూడండి.మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీలో ఓ వ్యక్తి మాస్కు సరిగా ధరించలేదని అతన్ని పోలీసులు దారుణంగా చితకబాదిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుందట.
హాస్పిటల్లో ఉన్న తన తండ్రి కోసం భోజనం తీసుకెళ్లే హడావుడిలో పడిన 35 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి మాస్కు ధరించడం మరచిపోయాడట.
సరిగా అదే సమయంలో మాస్కు ధరించలేదని పోలీసులు అతన్ని ఆపి రోడ్డుపై పడేసి తీవ్రంగా కొడుతూ, తలపై కాలు పెట్టి తొక్కుతూ దారుణంగా ప్రవర్తించారట.
కాగా ఆ వ్యక్తి బంధువులు ఎంతగా వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించలేదు.
అయితే అదే సమయంలో ఈ దారుణాన్న దృశ్యాలను అక్కడున్న కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో, విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందట.వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్యక్తిని కొట్టిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లుగా సమాచారం.