మగవారు మగవారిని పెళ్ళి చేసుకోవడం గురించి విన్నాం, ఆడవారు ఆడవారిని పెళ్ళి చేసుకోవడం గురించి కూడా విన్నాం.వీటిని గే/లెస్బియన్ మ్యారేజ్ అంటారు.
కాని మోసపోయి, తనకు ఏమాత్రం తెలియకుండా ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంది ఒక ఇండోనేషియన్ అమ్మాయి.ఈ వింత సంఘటన జాకర్తలో జరిగింది.
వివరాల్లోకి వెళితే, హెనియాతీ అనే 25 ఏళ్ళ అమ్మాయి మహమ్మద్ సపుత్రతో(అసలు పేరు సువార్తీ) ప్రేమలో పడింది.నిజానికి సపుత్ర అమ్మాయే.కాని అబ్బాయిగా నమ్మించింది.ఇద్దరు ప్రేమలో మునిగితేలారు.
ఓ ఏడు నెలలు గడిచాక జావా దివుల్లో పెళ్ళి చేసుకున్నారు.
పెళ్ళి జరిగినా, భర్త శృంగారంలో పాల్గొనట్లేదు.
ప్రతీసారి ఏదో సాకు చెప్పి తప్పించుకోవడం, ఇంటికి సరిగా రాకపోవడం, అంటి అంటనట్టుగా ఉండటం, రోజూ ఇదే వరస.దాంతో బయట ఎవరితోనైనా సంబంధం ఉందేమో అనే అనుమానం వచ్చింది భార్యకు.విషయం పోలిసులకి చెబితే, వారు విషయాలు బయటకి లాగారు.
సపుత్ర అసలు లేరు సువార్తి.ఆమె ఒక 40 ఏళ్ళ మహిళ.17 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు.పురుషుడిగా నటించి, హెనియాతిని పెళ్ళి చేసుకుంది.ఊహించని నిజాలు బయటపడేసరికి పెళ్ళికూతురు, తన తల్లిదండ్రులు వేదనకు గురయ్యారు.సువార్తీ పోలీసు కస్టడిలో ఉంది.తనకు 7 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందట.