నిన్న మొన్నటి వరకు ప్రకృతి విలయానికి మన కేరళ ఎంత కకావికలమైందో చూసాం.ఇప్పుడు సునామి రూపంలో ఇండోనేషియాను అతలాకుతలం చేస్తుంది.
ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, భారీ సునామీ కారణంగా భారీ ఆస్తి నష్టం, వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.సునామీ ధాటికి సులవేసి దీవిలోని పాలూ నగరం అతలాకుతలమైంది.
భవనాలు కూలిపోవడంతో వాటి శిథిలాల కింద భారీగా మృతదేహాలు చిక్కుకున్నాయి.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
మృతుల సంఖ్య 1,571కి చేరినట్లు అధికారులు తెలిపారు.భూకంపం-సునామీ కారణంగా 70 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తుంది.
కాగా, ఇండోనేషియాలో సంభవించిన సునామీకి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సునామి వచ్చి ఇలా అయింది అలా అయింది,చెట్లు, ఇల్లు కొట్టుకుపోయాయి అని వినడమే తప్పితే కళ్లారా చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్దం అవుతుంది.పాలూలో రోడ్డు ఉన్న ప్రాంతంలో ఇంకొన్ని క్షణాల్లో సునామీ కబళిస్తుందనగా రికార్డయిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
రోడ్డుపై వెళ్తున్న కార్లు వెళ్తున్నట్టగానే ఒక్కసారిగా వెనక్కి తిప్పుకుని వచ్చేస్తున్నాయి.రెప్ప మూసి తెరిసేంత క్షణంలో జలరక్కసి రావడం, చూస్తుండగానే నీటిలో ఇళ్లు, చెట్లు కొట్టుకురావడం స్పష్టంగా కనిపిస్తుంది.అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ప్రకృతి విలయానికి మారింది.
సునామి బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు.
.