అమెరికాలో కోవిడ్ కేసులు ఎక్కువై పోతున్నాయి.వేలల్లో ప్రజలు మృత్యు వాత పడుతుంటే.
లక్షల సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.రోజులు గడిచే కొద్ది మృతుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు వైద్యులు.
అయితే అక్కడ ఈ హృదయవిదారక ఘటనలని ప్రత్యక్షంగా చూస్తున్న భారత సంతతి మహిళా డాక్టర్ తన ఆవేదన వ్యక్తం చేసింది…ఎంతో మంది కరోనా బాధితులు ఆసుపత్రులలో నరకం అనుభవిస్తున్నారు.తమ ఇంట్లో వారికి ఫోన్లు చేసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.
చివరి చూపుకి కూడా నోచుకోకుండా చనిపోతున్న వారి సంఖ్య లెక్కకి మించీ ఉంది.డాక్టర్ గా వీటిని చూసిన నాలోని మనిషి ఎంతో రోదిస్తున్నాడు.
కానీ ఏమి చేయలేని పరిస్థితి.ఇలాంటి చావు మనకి అవసరమా…?? అంటూ ఆమె చెప్తున్నా మాటలు ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా చేస్తోంది.
సామాజిక దూరం పాటించండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ అమెరికాలో వైద్యురాలిగా పనిచేస్తున్న భారత సంతతి మహిళా డాక్టర్ తన అనుభవాలని భారత ప్రజలని ఉద్దేశించి తెలిపారు.న్యూయార్క్ వర్సిటీ లాంగోన్ మెడికల్ సెంటర్ బెలె వ్యూ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె కరోనా రోగులకి చికిత్స చేస్తున్నప్పుడు తన అనుభవాలు పంచుకున్నారు.మాకు కూడా ముప్పు ఉంటుందని తెలుసు కానీ మా వృత్తి ధర్మాని పాటిస్తున్నాం, చికిత్స కి కావాల్సిన పరికరాలు, మందులు తక్కువగా ఉంటే రోగులు ఎక్కవై పోతుంటే వారిని ఎలా కాపాడాలో తెలియక విలవిల లాడుతున్నాం.ఇంటికి వెళ్ళినా, పడుకున్నా ఇవే ఆలోచనలు మెదడుని తొలిచేస్తున్నాయి.
ఈ పరిస్థితి భారత్ కి రాకుండా ఉండాలంటే సామాజిక దూరాన్ని పాటించండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.