అమెరికాలో ఉండే భారతీయులు అందరూ తమ ప్రత్యేకతని ఎప్పటికప్పుడు చాటుతూ ఉంటారు.తమ ప్రతిభతో అమెరికాలో కీర్తించబడుతూనే ఉంటారు.
అలాంటి సంఘటనే తాజాగా అమెరికాలో జరిగింది.హర్త్స్టోన్ కాలేజియేట్ చాంపియన్షిప్ లో ఇండో అమెరికన్ అయిన శివ్ చోప్రా విజేతగా నిలిచాడు.
జార్జియా ఇండో-అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరుపున ఈ పోటీలోకి దిగిన శివ్ సత్తా చూపించాడు.
శివ్ తన బృందంలోని ఇద్దరు సహచరులు అయిన టేలర్ హియూ, సీన్ జోప్లిన్లతో కలిసి ఫైనల్ లో మిన్నెసోట టీంపై 3-0 తేడాతో ఘనవిజయం సాధించారు.
దాంతో శివ్ జట్టుకు భారీ స్కాలర్ షిప్ దక్కింది.ఈ స్కాలర్ షిప్ విలువ దాదాపు 9వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ.6,35, 795 లక్షలు.ఇదిలాఉంటే ఈ ఛాంపియన్ షిప్ లో అమెరికా, కెనడాకి చెందిన దాదాపు 400 జట్లు పాల్గొన్నాయి.
ఇండో అమెరికన్ అయిన శివ్ ప్రాతినిథ్యం వహించిన జార్జీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టు విజేతగా నిలిచింది.ఈ సందర్భంగా శివ్ మాట్లాడుతూ ప్రతీ గేమ్ను తమ టీం చాలా చాలెంజింగ్ గా తీసుకుని ఆడామని, అసాధారణ పోరాడటంవలెనే తమని విజయం వరించిందని తెలిపారు.అయితే ఈఎస్పిఎన్ నిర్వహించిన మొట్టమొదటి కాలేజియేట్ ఈ-స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ మరొక విశేషం.
.