నాసా అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతరక్ష పరిశోధనా సంస్థ.నాసాలో పనిచేయడం అంటే ఎంతో మంది శాస్త్రవేత్తలు గొప్పగా భావిస్తారు.
అలాంటి నాసాలో ప్రస్తుతం భారత శాస్త్రవేత్తలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.ఎంతో మంది భారతీయులు తమ నైపుణ్యంతో నాసాలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.
తాజాగా నాసాలో పనిచేస్తున్న భారతీయ మహిళకు కీలక భాద్యతలు అప్పగించారు, ఆమె పేరు సుభాషిణీ అయ్యర్.
తమిళనాడు లోని కోయంబత్తూరు లో పుట్టిన సుభాషిణీ అయ్యర్.స్థానికంగా ఉన్న ఓ కళాశాలలోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు.ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆ కాలేజీ నుంచీ మొట్టమొదటి సారిగా ఇంజనీరింగ్ పట్టా తీసుకున్న మొదటి మహిళ సుభాషిణి కావడం గమనార్హం.
ఇదిలాఉంటే ఉన్నత చదువుల ఆ తరువాత ఉన్నత చదువులు చదివిన ఆమె అంతరిక్ష పరిసోధనలపై దృష్టి సారించారు.ఆ దిశగా అడుగులు వేస్తూ నేడు ఆర్టేమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకుపోయే బోయింగ్ కోర్ ను మన సుభాషిణీ అయ్యర్ డీల్ చేసే స్థాయికి వెళ్ళారు.
నాసా ఆమెకు ఉన్నత పదవిని అప్పగించడం పై స్పందించిన సుభాషిణి అందుకు ఎంతో సంతోషంగా ఉందని, అత్యంత కీలక మైన భాద్యతలు తనపై ఉన్న నమ్మక్తంతో ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.చంద్రుడిపైకి మనుషులను పంపడం, అక్కడి పరిస్థితులను గమనించడం అలాగే అంగారక గ్రహంపై మంషులను పంపడం పై పరిశోధనలు చేయడం అక్కడికి మనుషులను పంపే పరిస్థితులను అంచనా వేయడం తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు.సుభాషిణి అయ్యర్ నాసాలో ఉన్నత పదవి చేపట్టడంపై నాసాలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.