టాలీవుడ్ సినిమా పరిశ్రమకి మెగా కుటుంబం నుంచి వచ్చి పలు చిత్రాలలో హీరోగా నటించడమే కాకుండా మరిన్ని చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించి నటుడిగా మరియు నిర్మాత మంచి విజయం సాధించిన మెగాబ్రదర్ నాగబాబు గురించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు అయితే ఈ మధ్యకాలంలో నటుడు నాగబాబు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నాడు.
ఈక్రమంలో అప్పుడప్పుడు పలువురు వైసిపి నేతలు చేసినటువంటి కామెంట్లని తిప్పి కొడుతూ విమర్శలు కూడా చేస్తున్నాడు.
అయితే ఏమైందో ఏమో గాని గత మూడు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి చేస్తున్న వ్యాఖ్యలపై మాత్రం నాగబాబు ఏమాత్రం స్పందించడం లేదు.దీంతో కొందరు మెగా అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ తన తమ్ముడి పై సినిమా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే మెగా బ్రదర్స్ చాలా సైలెంట్ గా ఉండటానికి కారణం ఏమిటో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాజాగా మెగాబ్రదర్ నాగబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ ని షేర్ చేశాడు.ఇందులో భాగంగా తన ఫోటోతో పాటు “నేను బలహీనుడిని అని మీరు చెప్పినప్పుడు నేను “స్ట్రాంగ్” అని వివరిస్తూ నేను సమయం వృధా చేయను.నేను మరింత స్ట్రాంగ్ అవుతాను.మరియు మీరు “తప్పు” అని నిరూపించడానికి అసమానమైన శిఖరాగ్రాలను అధిరోహించండి.పోరాడటానికి సమయం లేదు!” అంటూ ఫ్యాషన్ కూడా పెట్టాడు.దీంతో ప్రస్తుతం నాగబాబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా మెగా బ్రదర్ నాగబాబు ఎట్టకేలకు తన తమ్ముడు విషయంలో జరుగుతున్న కుట్ర గురించి పరోక్షంగా స్పందించాడని కామెంట్లు చేస్తున్నారు.కానీ నాగబాబు మాత్రం ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడని విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.అంతేకాకుండా యువ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నాడు.
అలాగే ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ హీరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.