విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలనేది మధ్యతరగతి ప్రజల కోరిక.భూమికి చాలా ఎత్తులో గాలిలో విహంవీక్షణం చేస్తుంటే ఆ మజాయే వేరు అంటుంటారు మధ్యతరగతి ప్రజలు చాలా ఆరాటపడుతున్నారు.
అయితే కొన్ని వామాన సర్వీసులు మధ్యతరగతి ప్రేక్షకులకు అప్పుడప్పుడు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ వారిని సంతృప్తి పరుస్తాయి.
తాజాగా ఇలాంటి ఆఫర్తోనే ప్రముఖ విమాన సర్వీసు రంగం ఇండిగో ముందుకు వచ్చింది.కేవలం రూ.899కే విమాన ప్రయాణం చేసేందుకు వీలును కల్పిస్తుంది ఇండిగో యాజమాన్యం.కొన్ని ఎంపిక చేసిన రూట్లలో ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండిగో తెలిపింది.అయితే ఈ ఆఫర్ ఏయే రూట్లలో ఉందో మాత్రం ఇంకా ఇండియో యాజమాన్యం తెలపలేదు.
దీంతో ప్రయాణికులు ఈ ఆఫర్ ఎందులో ఉందా అని ఆరాట పడుతున్నారు.
ఏదేమైనా ప్రయాణికులను బుట్టలో వేసుకునేందుకు విమానయాన సర్వీసులు ఎత్తులకుపైఎత్తులు వేస్తూ ప్రయాణికులను ఆకర్షించుకుంటున్నాయి.అయితే వాటిన్నింటిలో ఇండిగో యాజమాన్యం మాత్రం ముందు వరుసలో ఉందని తెలపాలి.మరి ఈ ఆఫర్కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.