కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఒక ప్రయాణికుడికి రెండు సీట్లను కేటాయించింది.
అయితే.ప్రయాణికుడికి ఆనుకుని ఉన్న సీట్ను మాత్రమే బుక్ చేసుకోవాలని తెలిపింది.
అంటే.ఉచితంగా ఎక్ట్స్రా సీట్ ఇస్తున్నారని అనుకున్నారా.
ఆలా అనుకుంటే భ్రమే.వారు 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆ డిస్కౌంట్ కూడా.అదనపు సీట్లో ప్రయాణికుడు ఉండడు కాబట్టి.
పీఎస్ఎఫ్, యూడీఎఫ్ లాంటి విమాన ఛార్జీలు వర్తించవన్నమాట.అందుకే బంపర్ ఆఫర్ అని చెప్పింది.
ఇక ఆఫర్ విషయానికి వస్తే.ఇండిగో వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.భౌతిక దూరం పాటించాలనుకునే ప్రయాణికుడు రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.‘6ఈ డబుల్ సీట్’ పేరుతో తీసుకొస్తున్న ఈ స్కీమ్లో భాగంగా ప్రయాణానికి 24 గంటల ముందు కూడా డబుల్ సీట్ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.జులై 24 నుంచి దీన్ని ప్రారంభిస్తున్నట్లు ఇండిగో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల విమాన ప్రయాణంపై నిర్వహించిన ఓ సర్వేలో భౌతిక దూరం పట్ల పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో కరోనా పంజా విసురుతుండటంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలిపారు.తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తోందని చెబుతోన్న మరి కొంత మంది మాత్రం.
ప్రయాణాల్లో భౌతిక దూరం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇండిగో ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.