న్యూజిలాండ్తో వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా అఖండ విజయం సాధించింది.దాంతో టీమిండియా 1-0 తేడాతో టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది.
గత కొద్ది రోజులుగా న్యూజిలాండ్తో టీమ్ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ డ్రా కాగా కొద్ది సేపటి క్రితమే పూర్తయిన రెండో టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది.
ఈ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ ఆడిన భారత్ మొత్తంగా 540 పరుగుల చేసింది.దాంతో న్యూజిలాండ్ జట్టు గెలుపు కోసం ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించాడానికి బరిలోకి దిగింది.
అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది.రెండో ఇన్నింగ్స్లో కూడా కీలక ప్లేయర్లు భారత బౌలర్లకు దాసోహం అంటూ పెవిలియన్ బాట పట్టారు.5 టాప్ ప్లేయర్ల వికెట్లు పేకమేడలా కుప్పకూలడంతో మిగతా ప్లేయర్లు భారత బౌలర్లను తట్టుకుని నిలబడగలిగారు.దాంతో న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులతో నాలుగో రోజుకి తమ ఆటను తీసుకెళ్లగలిగింది.
అయితే నాలుగో రోజు న్యూజిలాండ్ జట్టు 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 27 పరుగులు చేసి ఆలౌట్ అయింది.టీమిండియా మూడో రోజు ఐదు వికెట్లు నాలుగోరోజు మరో ఐదు వికెట్లు తీసి 372 పరుగులతో సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది.
ఈరోజు క్రీజ్లో ఉన్న హెన్రీ నికోల్స్ మొత్తంగా 44 పరుగులు చేసి అవుటయ్యాడు.మూడో రోజు డారిల్ మిచెల్ (60) అర్థ శతకంతో న్యూజిలాండ్ను గట్టెక్కించాడు.డారిల్ నికోల్స్తో కలిసి 50 పరుగుల పార్ట్నర్షిప్ సృష్టించాడు.అయితే చెలరేగిపోతున్న డారిల్ మిచెల్ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.దాంతో న్యూజిలాండ్ గెలుపుపై నిన్ననే నీలినీడలు కమ్ముకున్నాయి.స్పిన్ మాయాజాలంతో భారతీయ బౌలర్లు ఊహించిన సమయం ముందుగానే ఆలౌట్ చేశారు.
సంక్షిప్తంగా స్కోర్లు తెలుసుకుంటే.భారత్ తొలి ఇన్నింగ్స్ లో 345/10, రెండో ఇన్నింగ్స్ లో 276/7 (డిక్లేర్డ్) పరుగులు సాధించింది.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 62/10, రెండో ఇన్నింగ్స్ 167/10.