ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల, సంస్థలు పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ కి పంపించారు.అయితే కరోనా వ్యాక్సిన్లు ఇప్పటికే క్లినకల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలకంగా మారనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఎక్కువగా వినపడుతుంది.ఎందుకు అంటే.
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ను అందించడంలో భారత్ కు మాత్రమే సత్తా ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్ చెప్పిన విషయం తెలిసిందే.ఇక మరోసారి బిల్గేట్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని బిల్గేట్స్ అన్నారు.అయితే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మొదటి స్దానంలో ఉన్న భారత్ సహాయాన్ని తాము ఆశిస్తున్నట్లు బిల్గేట్స్ పేర్కొన్నారు.
అంతేకాదు వచ్చే ఏడాది మొదటి మూడు నెలల వరకు చాలా వ్యాక్సిన్ క్యాండిడేట్లు తుది ప్రయోగ దశకు చేరుకుంటాయని వెల్లడించారు.ఇక వచ్చే సంవత్సరం భారత్లో భారీ మొత్తంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ సురక్షితంగా, సమర్థవంతంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.ఇక త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ లు త్వరలో అందుబాటులోకి రావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 38 కోవిడ్ వ్యాక్సిన్ లు మానవ ప్రయోగ దశలో ఉన్నాయని తెలిపారు.ఇక మరో 93 కరోనా వ్యాక్సిన్ లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలియజేశారు.
రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.ఇక అమెరికా కనుగొన్న కోవిడ్ వ్యాక్సిన్ కు డెడ్లైన్ పెట్టిన విషయం తెలిసిందే.
అంతేకాదు భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.