అమెరికాలోని ఒర్లాండ్ లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వరంలో 11వ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించబడుతుంది.నవంబర్ 2 ,3 వ తేదీలలో ఈ వేడులకని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టుగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
కేవలం తెలుగు బాష , సాహిత్యానికి పెద్దపీట వేస్తూ రెండు రోజుల పాటు ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంతో మంది తెలుగు పండితులు, అష్టావధానులు విచ్చేస్తున్నారు.
అలాగే ప్రముఖ రచయితలు కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకోనున్నారు.
నవంబర్ 2వ తేదీన 12 వ ఘంటశాల ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమానికి కూడా పలువురు సంగీత గాయకులూ పాల్గొననున్నారు.ప్రేక్షకులని నచ్చిన సాహిత్య పరమైన అంశం మీద ప్రసంగించేలా విచ్చేసిన రచయితలని కవులని సంస్థ సభ్యులు కోరుతారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికి ప్రోశ్చహకాలు అందించబడుతాయి.అయితే
ఈ వేడుకల్లో పాల్గొనే వారికి ప్రవేశ రుసుము నిర్ణయించారు.ఫ్లోరిడా నుంచీ వచ్చే వారికి ఒక్కొక్కరికి 50 డాలర్లు.ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చే వారికి ఉచితంగా నిర్ణయించారు.
ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం 200 డాలర్లు విలువ చేసే తెలుగు పుస్తకాలు అందిస్తారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సంగీత విభావరి అలరించనుందని ఆహ్వనితులు తెలిపారు.
.