ఇండియన్ రియల్ హీరోస్ అయిన 40 మంది జవాన్లను మట్టుపెట్టిన ఉగ్రవాద సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.పుల్వామా ఉగ్ర దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.
పెద్ద ఎత్తున పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు పాకిస్తాన్ పరువు తీసేలా చేస్తున్నారు.ఇండియాపై దాడికి నిరసనగా పాకిస్తాన్ జాతీయ జెండాను టిష్యూ పేపర్ అంటూ సంబోధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మీరు కావాలంటే గూగుల్లో ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ టాయిలెట్ పేపర్ ఏంటీ అని ఇంగ్లీష్లో కొడితే కనిపించేది ఏంటో చూస్తే మీకు మతి పోయి, నవ్వు వస్తుంది.పాకిస్తాన్ జెండా ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన టాయిలెట్ పేపర్గా గుర్తింపు దక్కించుకుంది.టాయిలెట్ పేపర్గా పాకిస్తాన్ జాతీయ జెండాను వాడండి అంటూ కొందరు నెటిజన్స్ పిలుపునిస్తున్నారు.
పాకిస్తాన్ జెండాను ఇలా అవమానించడంతో ఆదేశ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ నెటిజన్స్ మాత్రం దమ్ము లేక ఉగ్రవాదులతో ఆత్మహుతి దాడి చేయిస్తున్న పాకిస్తాన్కు పౌరుషం లేదని, వారి జాతీయ జెండా ఇందుకు తప్ప మరెందుకు పని చేయదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దానికి తోడు పాకిస్తాన్లో ఉగ్రవాదానికి శిక్షణ ఇస్తున్నారని, ఇండియన్ ఆర్మీని ఎలా చంపాలి అనే విషయాలను శిక్షణ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టాయిలెట్ టిష్యూ పేపర్గానే కాకుండా, టాయిలెట్ టైల్స్ పై కూడా పాకిస్తాన్ జెండాను ముద్రిస్తున్నారు.ఈ విషయమై ఇండియన్ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకు చెప్పక పోవడంతో నెటిజన్స్ మరింతగా రెచ్చి పోతున్నారు.పాకిస్తాన్కు ఇలాంటి పరిస్థితి జరగాల్సిందే.