హైదరాబాద్ అనగానే యావత్ ప్రపంచంలో ఠక్కున గుర్తుకు వచ్చేది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బిర్యానీయే.అవును మరీ.
యావత్ ప్రపంచాన్ని తన రుచితో కట్టిపడేసే బిర్యానీ అంటే నోరూరని వారు ఉండరు.సాధారణ ప్రజలు మొదలుకొని ప్రపంచంలోని హేమాహేమీల వరకు హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడతారు.
అలాంటి బిర్యానీ ఇప్పుడు ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం హోటల్ వరకు వెళ్లి తినే తీరిక, ఓపిక లేని ప్రజలు స్విగ్గీ, జోమాటో తదితర యాప్ల పుణ్యమా అని ఇంటివద్దకే ఆహారాన్ని తెప్పించుకుని తింటున్నారు.
ఈ క్రమంలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ 2019కి గాను వార్షిక రోపోర్టును విడుదల చేసింది.ఈ రిపోర్టులో 2019లో ఎక్కవగా ఆర్డర్ చేసిన ఐటెమ్స్ లిస్టును వెల్లడించారు.
దీనిలో భారతదేశంలో టాప్ ప్లేస్లో నిలిచింది బిర్యానీ.దేశవ్యాప్తంగా సగటున నిమిషానికి 95 చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ రిపోర్టులో వెల్లడించింది.
అంటే బిర్యానీ కోసం జనం ఎలా ఎగబడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇదంతా కేవలం స్విగ్గీ రిపోర్టు మాత్రమే.
జొమాటో, ఊబర్ ఈట్స్ వంటి యాప్స్ కూడా తమ రిపోర్టులను వెల్లడిస్తే బిర్యానీ సత్తా ఏమిటో మనకు తెలుస్తుంది.ఏదేమైనా బిర్యానీ లేనిదే భోజనం చేసే పరిస్థితిలో జనం లేరనడానికి ఇదొక నిదర్శనం.
మరి మీరు కూడా వెంటనే ఓ బిర్యానీ ఆర్డర్ చేసుకుని కుమ్మేయండి.