అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారతీయులకి న్యాయం జరగాలంటే ఎస్.386 బిల్లు ని ఆమోదించాలని భారతీయులు అందరూ పట్టు బడుతున్నారు.ఈ మేరకు అన్ని భారతీయ సంఘాలు కలిసి అమెరికాలో కార్యాచరణ రూపొందించడానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు.అంతేకాదు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు అన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి.
ఎస్.386 ఈ బిల్లు వలన గ్రీన్ కార్డ్ కోటలో వలస వాసుల కి జారీచేసే 7 శాతాన్ని 15 శాతానికి పెంచుతారు.దాంతో అమెరికాలో ఉంటున్న సుమారు 6 లక్షల మంది భారతీయులకి భారీ లబ్ది చేకూరుతుంది.అయితే ఈ బిల్లుకి ఇంకా ఆమోద ముద్ర పడలేదు.ఇదిలాఉంటే ఈ బిలుని ఆమోదించాలని భారతీయ సంఘాలు అన్నీ ఏకం అయ్యాయి.
అమెరికాలోని చికాగోలో ఉన్న షిరిడీ సాయి మందిరంలో సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకున్నాయి.నైపుణ్యం కలిగిన వలస దారుల కుటుంభాలకి ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించారు.భారతీయ సంఘాలైన తానా గుజరాతీ బెంగాలి, కేరళా మొదలగు అసోసియేషన్ లు అన్నీ ఈ సమావేశంలో పాల్గొని మద్దతు తెలిపాయి.ఈ బిల్లుకి మద్దతు దొరికేలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని ఈ సభలో నిర్వహణ కీలక సభ్యులు తెలిపారు.