దాదాపు 22 వేల కిలోమీటర్లు, 17 దేశాలు దాటుకుంటూ, రెండు ఖండాలు గుండా ఓ భారతీయ కుటుంభం ప్రయాణం చేసింది.ఇంతకీ ఎందుకో తెలుసా వరల్డ్ కప్ మ్యాచ్ లని వీక్షించడానికి.
ఇప్పుడు ఈ భారతీయ కుటుంభం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది.మూడు తరాల కుటుంభ సభ్యులు కలిసి ఇలా క్రికెట్ ని వీక్షించడానికి వెళ్ళడం ఇదే ప్రధమం.
విమానంలో వెళ్తే ఎలాంటి కిక్కు ఉండదని అనుకున్న ఈ కుటుంభం వెరైటీగా కారులో వెళ్లాలని అనుకుంది.ఆకున్నదే తడవుగా సర్వం సిద్దం చేసుకుంది.సింగపూర్లో స్థిరపడిన అనుపమ్ మాధుర్ కుటుంభం మొత్తం పయనం అయ్యింది.అతడితో పాటు అతడి భార్య, ఇద్దరు చిన్నారులు, తల్లి తండ్రులు , కలిసి మే 20 వ తేదీనాడు తమ సెవెన్ కారులో సింగపూర్ నుంచీ బయలు దేరారు.
సింగపూర్ నుంచీ లండన్ వరకూ రోడ్ ప్రయాణం చేశారు.దాదాపు 48 రోజులపాటు 17 దేశాల మీదుగా సాగిన వీరి ప్రయాణం ఈ నెల 4 వ తేదీన లండన్ కి చేరుకుంది.శ్రీలంకతో జరిగిన భారత్ లీగ్ మ్యాచ్ ణి వీక్షించారు కానీ సెమీస్ లో మాత్రం వీరికి టిక్కెట్లు దొరకలేదు.ఈ క్రమంలో వీరి గురించి తెలుసుకున్న ఐసీసీ వారి కుటుంభానికి ప్రత్యెక పాస్ లని అందించింది.
.