ఇండియాలో ఏదైనా నేరం చేస్తే అయితే ఉరిశిక్ష లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఉంటారు.ఇండియాలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే కేవలం 14 ఏళ్ళు మాత్రమే జైలు జీవితం ఉంటుంది తరువాత శిక్ష పడ్డ వ్యక్తి బయటికి వస్తాడు.
ఇదిలా ఉంటే అమెరికా లాంటి దేశాల్లో ఏదైనా నేరం చేస్తే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి.తాజాగా ఇండియానాలో నికోలస్ అనే వ్యక్తికి న్యాయస్థానం ఏకంగా 160 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
నికోలస్ చేసిన నీచమైన పనికి న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేసింది.అతను పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఏకంగా తల్లిని చేశాడు.
నికోలస్ కారణంగా బాధిత బాలిక 11 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది.అయితే తల్లి అయిన తర్వాత ఆ బాలిక గ్రాండ్ కౌంటీలో నికోలస్ పై కోర్టుకెక్కింది.
దీంతో ఈ దారుణం బయట ప్రపంచానికి తెలిసింది.నికోలస్ పై గత సంవత్సరం పిల్లలపై వేధింపులకు పాల్పడినట్లు 10 కేసులు నమోదవడంతో పాటు ఆధారాలతో సహా నిరూపణ కావడం జరిగింది.
దీంతో బాధిత బాలిక ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు అతనికి ఏకంగా 160 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఈ శిక్ష ప్రకారం అతను చనిపోయేంత వరకు కూడా జైలు జీవితాన్ని గడపాల్సి ఉంటుంది.
బాలిక ధైర్యంగా బయటకు వచ్చి అతనిపై కేసు పెట్టడం ఇప్పుడు ఇండియానా లో హాట్ టాపిక్ గా మారింది.ఆమెకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా న్యాయస్థానం ధన్యవాదాలు తెలిపింది.