అదృష్టం వరించాలే గానీ చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయినట్టుగా, అదృష్టం వరించాలే గాని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు.రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వడమనేది లాటరీ తగిలిన సందర్భంలో మాత్రమే సాధ్యమవుతుంది.
ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో ఈ లాటరీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.అక్కడ పలు సమస్థలు నిర్వహించే లాటరీలు కొనుగోలు చేసే ఎంతో మంది భారతీయ కార్మికులు ఊహించని విధంగా భారీ లాటరీలు గెలుచుకుని రాత్రికి రాత్రే కోట్లకు అధిపతులు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
తాజాగా ఓ భారతీయులు ఇదే తరహాలో కోట్లు గెలుచుకున్నాడు.వివరాలలోకి వెళ్తే.
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టిక్కెట్ లాటరీలో భారతీయ వలస కార్మికుడికి ఊహించని విధంగా భారీ జాక్ పాట్ లభించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.24 కోట్లు పైనే అతడి ఈ లాటరీలో గెలుచుకున్నాడు.భారత్ లోని ఉత్తరప్రదేశ్ కి చెందిన మహ్మద్ సమీర్ అబుదాబి లో ఏసీ టెక్నీషియన్ గా ఎన్నో ఏళ్ళ నుంచీ పనిచేస్తున్నాడు.సమీర్ కు నెలకు కేవలం రూ.60వేలు మాత్రమే వస్తుంది , అక్కడ ఈ జీతంతో బ్రతకడం కష్టమని భావించిన అతడు నిత్యం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉండేవాడు ఈ క్రమంలోనే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాడు.తన స్నేహితులతో కలిసి కొన్ని రోజుల క్రితం
బిగ్ టిక్కెట్ లాటరీ లో ఓ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.ఎన్నో ఏళ్ళ నుంచీ అదృష్టం కోసం వేచి చూస్తున్న సమీర్ కు ఊహించని విధంగా మొదటి బహుమతిగా సుమారు 12 మిలియన్ దిర్హమ్స్ (భారతీయ కరెన్సీ లో రూ.24 కోట్లు పైమాటే) గెలుచుకున్నాడు.అయితే ఇందులో తనకు కేవలం రూ.12 కోట్లు వస్తాయని మిగిలినవి తన స్నేహితుల వంతుగా సమీర్ తెలిపాడు.ఈ డబ్బుతో తాను వ్యాపారం చేస్తానని, తల్లి తండ్రులకు కొంత డబ్బు డిపాజిట్ చేస్తానని సమీర్ తెలిపాడు.