సమాజంలో కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, వర్ణ వివక్ష ఎ స్థాయిలో ఉందో తరుచు జరిగిన సంఘటనలు చూసినపుడు తెలుస్తుంది.అయిన కూడా వాటిని ఏ మాత్రం కంట్రోల్ చేయలేం.
అయితే కొన్ని సంఘటనలు విన్నప్పుడు నిజంగా ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారు అనిపించక మానదు.ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
వివాహ బంధానికి మచ్చ తెచ్చే విధంగా, ఆడవాళ్ళ మీద గౌరవం పోయే విధంగా చేసింది.
తన భర్త నల్లగా ఉన్నాడన్న కారణంగా ఓ భార్య ఏకంగా అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసింది.
ప్రేమ్ శ్రీ అనే ఓ మహిళ సత్యవీర్ సింగ్ తో ఐదేళ్ళ క్రితం వివాహం అయ్యింది.వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.అయితే భర్త రంగుపై ఎప్పుడు హేళనగా మాట్లాడే ప్రేమ్ శ్రీ అతనిని మానసికంగా వేధించేది.అతను తీవ్రంగా ద్వేషించేది.
అయితే ఆ ద్వేషం కాస్తా చివరికి అతనిని చంపేంత వరకు వచ్చింది.అయితే ఆమె ఇంత దారుణానికి ఓడిగట్టుతుందని భర్త కుటుంబ సభ్యులు అస్సలు ఊహించలేదు.
అయితే ద్వేషంతో భర్తని చంపిన నేరానికి ఆమె ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతుంది.