నేపాల్ లో ఓ హోటల్ లో విషాదం... 8 మంది భారతీయులు మృతి

నేపాల్ లో ఘోరం జరిగింది.నేపాల్ పర్యటనకి వెళ్ళిన భారతీయులు ఓ హోటల్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

 Indian Touristsdied In Nepal-TeluguStop.com

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.ఈ ఘటనలో మృతిచెందిన వారంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తుంది.

ఖాట్మండూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌లో టూరిజం నిమిత్తం వచ్చిన వారు కేరళకి చెందిన రెండు కుటుంబాల వాళ్ళు దామన్‌లో ఓ హోటల్‌లో నాలుగు గదులు బుక్ చేసుకున్నారు.అవన్నీ లోపలి నుంచి మూసివేసి ఉంటాయని వాళ్ళు దిగకముందే హోటల్ మేనేజర్ చెప్పాడు.

అయిన కూడా వారు గదులని అద్దెకి తీసుకున్నారు.అయితే ఆ గదుల్లో ఉన్నవారెవరూ బయటికి రావడం లేదని హోటల్ యజమానికి ఓ టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో ఏదో జరిగిందని భావించిన హోటల్ సిబ్బంది గదులు పగలగొట్టి చూసారు.

అందులో రెండు కుటుంబాల వారు గతజీవులై ఉన్నారు.కేరళకు చెందిన ఎనమిది మంది టూరిస్టులు నేపాల్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందారు.

ఈరోజు ఉదయం నేపాల్‌లోని ఉన్న హోటల్‌లో ఈ ఘటన జరిగింది.హోటల్‌ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో ఊపిరాడక మృతి చెందారని పోలీసులు నిర్ధారించారు.

చనిపోయిన ప్రబీన్ కుమార్ యాదవ్, శరణ్యా, రంజిత్ కుమార్, ఇందు రంజిత్, శ్రీభద్ర, అబినబ్ సోరయ, అబి నాయర్, బైష్ణబ్ రంజిత్ లుగా గుర్తించారు.వీరిని గుర్తించిన పోలీసులు కేరళలోని వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube