కొంతమందికి లక్కు ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందే ఊహించలేము.అందుకు గల కారణాలు ఎలాంటివైనా సరే లక్కు చిక్కాలంటే రాసి పెట్టిఉనాల్సిందే.
ఇలాంటి లక్కు ఓ భారతీయుడిని వరించింది.సరదాగా దుబాయ్ వెళ్లి నాలుగురోజులు అలా అలా తిరిగి వద్దామని అనుకుని వెళ్లి దుబాయ్ చుట్టేసిన లలిత్ శర్మ స్థానికంగా కొన్న ఓ లాటరీ టిక్కెట్టు అతడి లైఫ్ టర్న్ చేసేసింది.
చెన్నై కి చెందిన లలిత్ శర్మ తన చెల్లెలు దుబాయ్ లో ఉన్న కారణంగా ఆమెని చూడటానికి వెళ్ళాడు.10 రోజల పాటు అక్కడే ఉండి.అన్ని ప్రదేశాలు చుట్టేసి తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ లో ఓ డీడీఎఫ్ కి చెందిన లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితే తరువాత అతడికి ఆ టిక్కెట్టు లో తగలక పోవడంతో మళ్ళీ తన చెల్లెలు సాయంతో చెన్నై నుంచీ ఆన్లైన్ లో మరో టిక్కెట్టు బుక్ చేశాడు.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీలో ఈ సారి బంపర్ జాక్ పాట్ కొట్టాడు.ఒక్క టిక్కెట్టు కొనుగోలు తో సుమారు 7కోట్ల 15 లక్షలు గెలుచుకున్నాడు.ఈ విషయం తన చెల్లెలు చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బైన శర్మ తన భార్యా పిల్లలుతో కలిసి త్వరలోనే దుబాయ్ వెళ్లి సొమ్ము మొత్తాన్ని తెచ్చుకోనున్నాడు.