పాకిస్తాన్‌ ఆధీనంలో విశాఖ వాసి

రాజస్థాన్‌ థార్‌ ఎడారి పర్యటన నిమిత్తం వెళ్లిన కొందరు కొన్ని సార్లు పొరపాటున పాకిస్తాన్‌ బౌర్డర్‌లోకి వెళ్లడం జరుగుతుంది.తాజాగా అదే జరిగింది.

 Indian Tourist Guys In Pakisthancustody-TeluguStop.com

పాకిస్తాన్‌లోకి ఇండియాకు చెందిన ఇద్దరు యువకులు వెళ్లారు.వారిని అనుమానితులుగా పాక్‌ ఆర్మీ వారు అరెస్ట్‌ చేశారు.

పాకిస్తాన్‌ ఆర్మీ ప్రస్తుతం వీరిని ప్రత్యేకంగా ఇంటరాగేట్‌ చేస్తుందట.పాకిస్తాన్‌లో ఉగ్రదాడికి వీరు ప్రయత్నించారనే అపవాదుతో కేసు కూడా నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

స్థానిక మీడియాలో వీరిద్దరిపై విషం కక్కుతూ కథనాలు వస్తున్నాయి.ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి వైజాగ్‌కు చెందిన వ్యక్తి.ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఇప్పటికే పాకిస్తాన్‌ ప్రకటించింది.వారిద్దరు కూడా అమాయకులు అంటూ ఇండియన్స్‌ వాదిస్తుంటే పాకిస్తాన్‌ మాత్రం ఉగ్రదాడికి వచ్చి ఉంటారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరులో ఒక వ్యక్తి సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ అవ్వడం వల్ల అతడు అత్యాధునిక టెక్నాలజీతో పాకిస్తాన్‌లో మారణ హోమంకు ప్రయత్నిస్తున్నాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే పాకిస్తాన్‌ వారిని అరెస్ట్‌ చేసిన విషయంలో కేంద్రం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube