అమెరికా ఇచ్చే పర్యాటక వీసా కోసం ఏళ్ళ తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని నెలకొన్న విషయం విధితమే.అమెరికాలో ఉన్న తమ పిల్లలను చూసుకోవడం కోసం ఈ పర్యాటక వీసా పొందేందుకు తల్లి తండ్రులు పడిగాపులు కాస్తున్నారు.
అయితే ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు భారత్ తో సహా ఇతర దేశాలకు వెళ్లి తిరిగి అమెరికా వచ్చేటప్పుడు విసా స్టాంపింగ్ అవసరం లేకుండానే అమెరికాలోకి ప్రవేసించవచ్చునని ప్రకటించింది.
అమెరికాలో స్టూడెంట్ వీసా పై ఉంటున్న వారు ఇతర దేశాలకు వెళ్లి వచ్చే సమయంలో వీసా స్టాంపింగ్ వేయించుకుని రావాలి అలాగే ఇంటర్వ్యూ లో కూడా పాల్గొనాల్సి వచ్చేది.అయితే ఈ పరిస్థితిని నుంచీ మినహాయింపును ఇస్తోంది అమెరికా.
ఇకపై భారతీయులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లి వచ్చే టప్పుడు లేదంటే సొంత దేశానికి వెళ్లి వచ్చే క్రమంలో ఎలాంటి విసా స్టాంపింగ్, ఇంటర్వ్యూలు ఇకపై ఉండవని తెలిపింది.
స్టూడెంట్ వీసా దారుడితో పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ఉన్న స్టూడెంట్స్ కి కూడా ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది.ఈ వీసా భారతీయ విద్యార్ధులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే.పర్యాటక వీసా జారీ ఉన్న సమయాభావం కారణంగా ఎంతో మంది తల్లి తండ్రులు తమ పిల్లలను చూసుకోవడానికి లేకుండా పోతోంది, పైగా అంత ఖర్చులు పెట్టుకుని విద్యార్ధుల తల్లి తండ్రులు వచ్చే అవకాశాలు కూడా చాలా మందిలో తక్కువగా ఉంటాయి.
ఈ నేపధ్యంలో అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న వారి పిల్లలు ఎలాంటి నిభందనలు లేకుండా భారత్ లో ఉన్న తల్లి తండ్రులను కలిసి తిరిగి అమెరికా వచ్చేయచ్చు.