అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి సంఘటన తీవ్ర రూపం దాల్చుతోంది.రోజు రోజుకి నిరసన సెగలు అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తున్నాయి.
మరో పక్క రాష్ట్రాలు నిరసన కారులని కట్టడి చేయకపోతే సైన్యాన్ని దించడంలో వెనుకాడనని ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇదిలాఉంటే నిరసన కారుల కారణంగా షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద పెద్ద దుకాణాలు అన్ని ధ్వంసం అయ్యాయి.
అంతేకాదు విలువైన వస్తువులు డబ్బులని నిరసన కారులు దోచుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే
అమెరికాలోని నిరసనలు వెల్లువెత్తుతున్న మినియాపోలిస్ ప్రాంతలో హోటల్స్ దాదాపు ధ్వంసం అయ్యాయి.
అమెరికాలోనే అత్యధికంగా ఈ భారతీయ హోటల్స్ ఎక్కువగా ఉంటాయి.నిరసన కారుల దాడిలో అత్యధికంగా ద్వంసం కాబడినవి భారతీయుల హోటల్స్ అని తెలుస్తోంది.
ఇప్పటికే కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బ తినడంతో భారతీయ ఎన్నారైలు చతికిలపడిపోయారు.ఆర్ధికంగా నష్టపోయిన వారికి తాజాగా ఈ అల్లర్ల నేపధ్యంలో హోటల్స్ దెబ్బ తినడంతో మరింత ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు భారతీయ ఎన్నారైలు.
ప్రస్తుతం ఈ నష్టంతో వారు దివాలా తీసే తీసే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.ధ్వంసానికి గురయిన హండీ రెస్టారెంట్, గాంధీ మహాల్, ఇంటర్నేషనల్ బజార్, అనన్య డ్యాన్స్ ధియాటర్ ప్రముఖ రెస్టారెంట్స్ అని తెలుస్తోంది.అయితే వీటిలో తెలుగు వారికి చెందినవి ఏవీ లేవలని.నష్టానికి గురయిన రెస్టారెంట్స్ నష్టపరిహానం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
.