సుఖ ప్రయాణాల కోసం రైల్వే శాఖ వినూత్న పథకం... మసాజ్ సేవలు

మసాజ్ కావాలి అంటే ఇక ఇప్పుడు మసాజ్ సెంటర్ కే వెళ్లనవసరం లేదు.రైళ్ల లో కూడా ఈ మసాజ్ సేవలు లభించనున్నాయి.

 Indian Railways To Offer Head And Foot Massage In 39 Trains-TeluguStop.com

భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ వినూత్న పథకానికి తెరలేపింది.ఇండోర్ నుంచి వెళ్లే 39 ప్యాసింజర్ రైళ్ల లో ఈ మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

వీటిలో డెహ్రాడూన్‌-ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ (14317), న్యూఢిల్లీ-ఇండోర్‌ ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్‌ (12416), ఇండోర్‌-అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ (19325) రైళ్ల లో ఈ మసాజ్ సేవలు లభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.మరో 20 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి ఈ సేవలు రానున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇండోర్ నుంచి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఆరాంగా రైలు లోనే మసాజ్ చేయించుకోవచ్చు అన్నమాట.

సుఖ ప్రయాణాల కోసం రైల్వే శాఖ వ

ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు పొందవచ్చు.కేవలం 100 రూపాయలు చెల్లించి తల, పాదాల మసాజ్‌ చేయించుకోవ చ్చని, ప్రతి రైలులో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు మసాజ్‌ సేవలు చేసే వారు ఉంటారు అని అధికారులు తెలిపారు.వారందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

నిజంగా రైలు ప్రయాణం సమయంలో ఈ విధంగా మసాజ్ కూడా లభిస్తే ఆ ప్రయాణం మరింత సుఖంగా సాగే అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube