మసాజ్ కావాలి అంటే ఇక ఇప్పుడు మసాజ్ సెంటర్ కే వెళ్లనవసరం లేదు.రైళ్ల లో కూడా ఈ మసాజ్ సేవలు లభించనున్నాయి.
భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ వినూత్న పథకానికి తెరలేపింది.ఇండోర్ నుంచి వెళ్లే 39 ప్యాసింజర్ రైళ్ల లో ఈ మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.
వీటిలో డెహ్రాడూన్-ఇండోర్ ఎక్స్ప్రెస్ (14317), న్యూఢిల్లీ-ఇండోర్ ఇంటర్సిటీఎక్స్ప్రెస్ (12416), ఇండోర్-అమృత్సర్ ఎక్స్ప్రెస్ (19325) రైళ్ల లో ఈ మసాజ్ సేవలు లభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.మరో 20 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి ఈ సేవలు రానున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇండోర్ నుంచి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఆరాంగా రైలు లోనే మసాజ్ చేయించుకోవచ్చు అన్నమాట.
ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవలు పొందవచ్చు.కేవలం 100 రూపాయలు చెల్లించి తల, పాదాల మసాజ్ చేయించుకోవ చ్చని, ప్రతి రైలులో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు మసాజ్ సేవలు చేసే వారు ఉంటారు అని అధికారులు తెలిపారు.వారందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిజంగా రైలు ప్రయాణం సమయంలో ఈ విధంగా మసాజ్ కూడా లభిస్తే ఆ ప్రయాణం మరింత సుఖంగా సాగే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు