దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్దం అయ్యింది.ఇప్పటి వరకు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు సాగాయి.
కాని ఇకపై ఆ రాకపోకలు కూడా సాగవంటూ కేంద్ర హోం శాఖ ప్రకటించింది.ఇప్పటికే తెలంగాణలో బోర్డర్స్ అన్ని కూడా బంద్ చేశారు.
జిల్లాల నుండి జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిపేశారు.ఇక గ్రామాల్లో కూడా ఒక గ్రామం నుండి మరో గ్రామంలోకి రాకపోకలు నిలిపేశారు.
తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా అమలు అవుతున్న ఈ విధానంను ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలని నిర్ణయించారు.కరోనా మహమ్మారి మరింతగా విస్తరించకుండా ఉండేందుకు ఇంతకు మించి మరో మార్గం లేదంటూ కేంద్ర ఉన్నత స్థాయి వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చచ్చినా అదే ప్రాంతంలో చనిపోవాలి తప్ప అడుగు బయటకు పెట్టవద్దంటూ కఠినంగా సూచనలు చేస్తున్నారు.