మేనేజ్మెంట్ కన్సల్టింగ్ దిగ్గజం మేకిన్సే అండ్ కంపెనీలో భాగస్వామిగా వున్న భారత సంతతికి చెందిన పునీత్ దీక్షిత్ (40)ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి 4,50,000కు పైగా అక్రమార్జనకు పాల్పడినట్లుగా ఆయనపై ఆరోపణలు వున్నాయి.
పునీత్ దీక్షిత్ చట్టవిరుద్ధంగా వ్యాపారం చేశారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో ఆయనను బుధవారం అరెస్ట్ చేశారు.అలాగే సెక్యూరిటీల మోసానికి సంబంధించి రెండు కౌంట్లతో అభియోగాలు మోపారు.1934 సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ చట్టంలోని సెక్షన్ 10 (బీ) నిబంధనలను పునీత్ ఉల్లంఘించినట్లు నిర్ధారించారు.ఈ క్రమంలో ప్రతి కౌంట్పై ఆయన దాదాపు 20 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటారని న్యాయశాఖ వర్గాలు అంటున్నాయి.మెకిన్సే భాగస్వామిగా ప్రాతినిథ్యం వహిస్తున్న పునీత్ దీక్షిత్ . కన్జ్యూమర్లోన్ ఫిన్టెక్ ఫ్లాట్ఫామ్ గ్రీన్స్కైను గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ త్వరలో కొనుగోలు చేయబోతున్నట్లుగా అత్యంత రహస్య సమాచారాన్ని ముందే తెలుసుకున్నారని ఎస్ఈసీ తెలిపింది.
దీంతో ఎక్విజిషన్ ప్రకటనకు ముందే పునీత్ భారీగా షేర్లను కొనుగోలు చేశారని.
గోల్డ్మన్ సాచ్స్ టేకోవర్ తర్వాత గ్రీన్స్కై షేర్ ధరలు 44 శాతం పెరిగాయని సీఎన్బీసీ తెలిపింది.సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పునీత్ దీక్షిత్ అక్రమార్జన కోసం కొనుగోలు ప్రకటన తర్వాత షేర్లను విక్రయించాడని ఎస్ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది.
దీని వల్ల అతనికి దాదాపు అర మిలియన్ అక్రమ లాభాలు వచ్చాయని యూఎస్ అటార్నీ డామియన్ విలియమ్స్ వ్యాఖ్యానించారు.
గ్రీన్ స్కై కొనుగోలుకు సంబంధించిన మెటీరియల్ కోసం దీక్షిత్ తన యాక్సెస్ను ఉపయోగించుకుని ఆప్షన్స్ మార్కెట్లో చేసిన ట్రేడ్ల ద్వారా లాభాలు ఆర్జించాడని ఎఫ్బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ మైఖేల్ జే డ్రిస్కాల్ అన్నారు.ఇలాంటి చర్యలు ఆర్ధిక మార్కెట్ల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని డ్రిస్కాల్ అభిప్రాయపడ్డారు.తమ విధానాలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను భాగస్వామిగా అతనిని తొలగిస్తున్నట్లు మెకిన్సే ప్రకటించింది.
తాము ఈ కేసు దర్యాప్తులో అధికారులకు సహకరిస్తామని వెల్లడించింది.దీక్షిత్ తన యజమాని, క్లయింట్ యొక్క రహస్య సమాచారాన్ని తన స్వంత ఆర్ధిక లాభం కోసం దుర్వినియోగం చేశాడని ఎస్ఈసీ ఆరోపించింది.