యూకేలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన నర్స్, ఆమె ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురయ్యారు.
నార్తంప్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.మృతురాలిని అంజు అశోక్ (35), ఆమె కుమారుడు (ఆరు సంవత్సరాలు), కుమార్తె (నాలుగు సంవత్సరాలు)గా గుర్తించారు.
కేరళలోని కొట్టాయంకు చెందిన అంజు, తన భర్త పిల్లలతో కలిసి కొన్నేళ్ల క్రితం బ్రిటన్కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేస్తోంది.అంజు శరీరంపై స్వల్ప గాయాలు వుండటంతో ఆమె భర్త సజును అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కెట్టెరింగ్లో వున్న అంజు అపార్ట్మెంట్ నుంచి అరుపులు వినిపించినట్లు స్థానికులు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.అంజు అక్కడికక్కడే చనిపోగా.చిన్నారులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయారు.త్వరలోనే దోషులను పట్టుకుంటామని నార్తంప్టన్ పోలీస్ చీఫ్ స్టీఫ్ ఫ్రీమాన్ తెలిపారు.
మరోవైపు కుమార్తె మరణవార్తను తెలుసుకున్న అంజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమార్తె, మనవడు, మనవరాలి మృతదేహాలను భారతదేశానికి తీసుకురావాలంటే రూ.30 లక్షలు ఖర్చవుతుందని.అంతటి స్తోమత తమకు లేదని వారు వాపోతున్నారు.తమ అల్లుడు సజు గతంలో అంజూని, మనవడిని దారుణంగా కొట్టేవాడని వారు చెబుతున్నారు.సౌదీలో ఉద్యగం చేసిన సజు.ప్రస్తుతం ఖాళీగానే వుంటున్నాడని అంజు తల్లిదండ్రులు తెలిపారు.వీరిద్దరికి 2012లో వివాహం జరిగందని ,తమ అల్లుడు కోపిష్టే కానీ.హత్యలు చేస్తాడని అనుకోవడం లేదని అంజు తల్లి అన్నారు.గతంలో తాను వారితో కలిసి వున్నానని , ఆ సమయంలో అతని కోపం చూసి తానే భయపడిపోయేదాన్నని ఆమె చెప్పింది.