అమెరికాలో కరోనా దావానలంగా విస్తరిస్తోంది.గంటల వ్యవధిలో వందల సంఖ్యలో అమెరికా వ్యాప్తంగా మరణాలు నమోదు అవుతున్నాయి.
లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి.చైనాలోనే ఈ వైరస్ పుట్టినా తీవ్రమైన ప్రభావం చూపుతోంది మాత్రం అమెరికాలోనే.
మొన్నటి వరకూ ఈ వైరస్ ఇటలీ , ఇరాన్ లపై కర్కశంగా తన పంజా ఘులిపించింది కాగా ఇప్పుడు అమెరికాని కబళించడానికి సిద్దమయ్యింది.
కరోన కారణంగా ఇప్పటి వరకూ అమెరికాలో 10 వేల మంది చనిపోయా.3.50 లక్షల మంది కరోనా వ్యాధి సోకి తీవ్ర ఆందోళనలకి లోనవుతున్నారు.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గడవబోయే వారం రోజుల సమయం మరింత దయనీయంగా ఉంటుందని మరింతమంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉందని మీడియా ప్రకటన చేశారు.ఇదిలాఉంటే
అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయ ఎన్నారైల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.తాజాగా నలుగురు ఎన్నారైలు ఈ కరోనా బారిన పడి చనిపోయినట్టుగా వారందరూ న్యూయార్క్ కి చెందిన వారుగా మలయాళీ సంస్థ ఒకటి ప్రకటించింది.అయితే వారికి సంభందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
అంతేకాదు ఇప్పటి వరకూ అమెరికాలో ఎంతమంది భారతీయులు ఈ వైరస్ బారిన పడ్డారు.ఎంతమంది చనిపోయారు అనే వివరాలు తెలియడం లేదు…
.