అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు ఒక్కో సారి ఆర్ధిక కష్టాలలో ఉన్న సమయంలో అమాంతం కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటాయి.ఇప్పుడు అలాంటి సంఘటనే దుబాయ్ లోని భారతీయుడికి ఎదురయ్యింది.
అయితే ఇతడికి ఆర్ధిక కష్టాలు లేకపోయినా భంపర్ లాటరీ మాత్రం గెలుచుకున్నాడు.ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు, అతడు గెలుచుకున్న మొత్తం ఎంత అనే వివరాలోకి వెళ్తే.
భారత్ నుంచీ దుబాయ్ కు ఎంతో మంది పొట్ట కూటికోసం వలసలు వెళ్తూ ఉంటారు.అక్కడ వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.అలా వెళ్ళిన వాడే కర్నాటకకు చెందిన క్రిష్ణప్ప.2005 లో దుబాయ్ వెళ్లి అక్కడ మెకానికల్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు.అయితే ఎన్నో ఏళ్ళుగా లాటరీ టిక్కెట్టు కొనడం తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం అలవాటు చేసుకున్న అతడికి అతడి స్నేహితులు కూడా తోడయ్యారు.కొన్నాళ్ళ పాటు అందరూ కలిసి టిక్కెట్లు కొనుగోలు చేసినా ఎప్పుడు కూడా వారిని అదృష్టం వరించలేదు.
దాంతో ఈ సారి ఒక్కడే లాటరీ టిక్కట్టు కొనుగోలు చేశాడు.
ఎన్నో ఏళ్ళుగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేస్తున్న అతడికి లాటరీ నిర్వాహకులు ప్రత్యెక ఆఫర్ ఇవ్వడంతో రెండు టిక్కెట్లు కొనుగోలు చేశాడు.దాంతో అదృష్టం వరించింది.అతడు కొన్న రెండు టిక్కెట్ల లో ఒక టిక్కెట్టు 202511 కు ఊహించని లాటరీ తగిలింది.
లాటరీ నిర్వాహకులు క్రిష్ణప్ప కు ఫోన్ చేసి మీరు 12మిలియన్ దిర్హమ్ లు గెలుచుకున్నారని చెప్పడంతో అతడు నమ్మలేక పోయాడు.ఒక్క సారిగా ఇది నిజమా, కలా అనే సందిగ్ధంలో పడిపోయాడు.
నేరుగా వెళ్లి చూస్తెనే కాని తాను ఈ విషయాన్ని నమ్మలేక పోయానని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశానని ఇప్పటికి నన్ను అదృష్టం వరించిందని తెలిపాడు క్రిష్ణప్ప.ఈ డబ్బుతో సొంత గ్రామం లో ఇల్లు కట్టుకుని పిల్లల పేరు డబ్బు డిపాజిట్ చేస్తానని తెలిపాడు.ఇంతకీ అతడు గెలుచుకున్న మొత్తం ఎంతో తెలుసా అక్షరాలా రూ.24 కోట్లు.